ఘట్కేసర్, మే 13 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘట్కేసర్లో నిర్వహిస్తున్న కొవిడ్ సేవలను మంత్రి మల్లారెడ్డి గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ టీకా పంపిణీ, పరీక్షలు, ఏర్పాట్లు, సౌకర్యాలను మంత్రి దవాఖాన ఇన్చార్జి డాక్టర్ కొట్యా నాయక్ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ సేవల కోసం దవాఖానకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించాలని మంత్రి మల్లారెడ్డి మున్సిపాలిటీ, దవాఖాన అధికారులను ఆదేశించారు. అనంతరం ఘట్కేసర్లో అదనంగా ఏర్పాటు చేసిన టీకా పంపిణీ సెంటర్ను మంత్రి పరిశీలించారు. టీకా కోసం వచ్చే ప్రజలకు తాగునీరు, కూర్చోడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఘట్కేసర్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్షల కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. కొవిడ్ లక్షణాలు ఉంటే మల్లారెడ్డి దవాఖానకు పంపాలని నిర్వాహకులను మంత్రి సూచించారు. చైర్పర్సన్ ముల్లి పావనీజంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ దవాఖాన ఇన్చార్జి డాక్టర్ కొట్యా నాయక్, డీఎంహెచ్వో మల్లికార్జున్, అడిషనల్ డీఎంహెచ్వో నారాయణరావు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.