కార్మికశాఖ మంత్రి చామకూర మలారెడ్డి
రూ. 2.10కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం
శామీర్పేట, ఏప్రిల్ 27 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో మంగళవారం రూ. 2. 10కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగా ణ అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామీగా నిలిచిందన్నారు. మరిన్ని నిధులు వెచ్చించి తూంకుంట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ పన్నాల వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు ఉమశ్రీనివాస్, నర్సింగ్రావుగౌడ్, రాజ్కుమార్ యాదవ్, సురేశ్, కో-ఆఫ్షన్ సభ్యులు మిర్జాషఫిఉల్లాబేగ్, శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్యాదవ్, టీఆర్ఎస్ ము న్సిపల్ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్రెడ్డి, యూత్ అధ్యక్షుడు సుభాశ్గౌడ్, దాసరి గోపాల్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, ఆంజనేయులు, సంతోష పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీలోని హకీంపేటలో రూ. 13లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, సింగాయిపల్లిలో రూ. 18లక్షలతో సీసీ రోడ్డు, దేవరయాంజాల్లో రూ. 40లక్షలతో బీటీ రోడ్డు, హనుమాన్ దేవాలయం వద్ద రూ. 10లక్షలతో సీసీ రోడ్డు, తూంకుంటలో ఆర్టీసీ కాలనీలో రూ. 13లక్షలతో సీసీ రోడ్డు, సింగాయిపల్లిలో రూ.15 లక్షలతో, రూ.12 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, తూంకుంట మున్సిపాలిటీలోని రూ. 12లక్షలతో 5వ, రూ. 12లక్షలతో 6వ, దేవరయాంజాల్లో రూ. 12లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్, తూంకుంటలోని రూ. 33లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.