శామీర్పేట, ఏప్రిల్ 23 : ఉప్పర్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 999 భూమితో మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని భూ య జమాని సుబ్బరాజు అన్నారు. సోషల్ మీడియా లో మంత్రిపై వస్తున్న ప్రచారాలపై యజమాని స్పందించి శుక్రవారం శామీర్పేటలో మీడి యా సమావేశం ఏర్పాటు వివరాలు వెల్లడించారు. ఉప్పర్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 999లో తాను భూమిని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆ భూమి విషయంలో కొం దరు ఇబ్బందులు పెట్టగా తను హైకోర్టు, సుఫ్రీంకోర్టులో కేసు గెలవడం జరిగిందన్నారు. అయిన ఇబ్బందులు తగ్గకపోవడంతో శామీర్పేట పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ఈ విషయం లో సదరు వ్యక్తులు మంత్రితో పరిచయాలు ఉన్నాయని, ఆయన మనుషులమని బెదిరింపులకు గురి చేస్తుండడంతో బాధ కలిగి సోషల్ మీడియాను ఆశ్రయించనన్నారు. కాని మంత్రి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రస్తావించలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంకారణంగా మంత్రి మల్లారెడ్డి ఇబ్బంది కలిగి ఉంటే బహిరంగ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. నా భూమి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై, మంత్రి మనుషులం అంటు ప్రచారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.