మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 24 : దమ్మాయిగూడ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాలనీ వాసుల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్ పార్కు, సీసీ కెమెరాలు, కౌన్సిలర్ మోర మౌనిక నరహరి రెడ్డి సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆదివారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ స్వామి, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరి గౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.