మేడ్చల్ రూరల్ : అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవనిగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం బోయినిపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్కు చెందిన అంజమ్మకు రూ.45వేల చెక్కును అందజేశారు. కౌన్సిలర్ తుడుం గణేశ్, నాయకులు పాల్గొన్నారు.
శామీర్పేట : శామీర్పేట మండల పరిధిలోని పొన్నాల గ్రామానికి చెందిన మాల్యాల రమేశ్ వైద్య సహాయనిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.36 వేలు, తూంకుంట మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన ఉప్పర్పల్లి రేణుకకు రూ.42,500 చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను చైర్మన్ కారింగుల రాజేశ్వర్ రావు , జడ్పీటీసీ అనితాలాలయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి, నాయకులు అందజేశారు. కౌన్సిలర్లు పాండు, హరిబాబు, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్గృహకల్ప కాలనీకి చెందిన నాగరాజుకు రూ.32వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి అందజేశారు. మాజీ ఎంపీటీసీ కొత్త శ్రీనివాస్ గౌడ్, 3వ వార్డు టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.
జవహర్నగర్ : జవహర్నగర్ కార్పొరేషన్లోని 5వ డివిజన్కు చెందిన రమకు రూ. 21వేల చెక్కును మంత్రి మల్లారెడ్డి అందజేశారు. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా, కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, సతీష్కుమార్, శాంతికోటేశ్ గౌడ్, జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దులుయాదవ్ పాల్గొన్నారు.
కీసర : కీసర గ్రామానికి మోటే రాజుకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును మంత్రి మల్లారెడ్డి అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ సుజాత, నాయకులు పాల్గొన్నారు.
బోడుప్పల్ : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి… 8వ డివిజన్కు చెందిన బాధితుడి కుటుంట సభ్యులకు రూ.2.25లక్షల సీఎం సహాయనిధి చెక్కును మంత్రి అందజేశారు. డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, కార్పొరేటర్ సీసా వెంకటేశ్గౌడ్, రవిగౌడ్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 17వ డివిజన్ ఆదర్శనగర్కు చెందిన సయ్యద్ అఫ్రీన్ కుటుంబ సభ్యులకు రూ.40వేల సీఎం సహాయనిధి చెక్కును మంత్రి అందజేశారు. డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్ పాల్గొన్నారు.