మేడ్చల్, అక్టోబర్ 19 : సీఎంఆర్ఎఫ్ నిరుపేదల పాలిట వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన మమత, పట్టణానికి చెందిన రాధాబాయి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని తెలిపారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. సంక్షోభంలో కూడా సీఎం సహాయనిధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్, రవీందర్గౌడ్, సుదర్శన్రెడ్డి, సత్తిరెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.