మేడ్చల్ రూరల్, అక్టోబర్ 18 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి… సుతారిగూడలో సోమమవారం మేడ్చల్-గండిమైసమ్మ దారిలో నిర్మించిన బస్టాండ్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో నిధులలేమితో కొట్టుమిట్టాడిన పట్టణాలు నేడు నగర స్థాయి అభివృద్ధిని సొంతం చేసుకున్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు నిధులు సమకూరి, సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు రజితావెంకటేశ్ ముదిరాజ్, మల్లికార్జున్ ముదిరాజ్, వీణాసురేందర్ గౌడ్, శ్రీలతాశ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, బాల్రాజు, రవికుమార్ రాజు, ఆంథోనమ్మఫిలిప్స్, రాజకుమారిసుధాకర్, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.