మేడ్చల్, అక్టోబర్ 17 : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన పెద్దలింగరి లక్ష్మి, మసాని శ్రీశైలం, చిన్నం బాలమణి, సంగారెడ్డికి చెందిన అక్షిత అనారోగ్యం నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వారికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ రాజారెడ్డి, మేకల వెన్నెల రామకృష్ణుడు, నర్సింగ్రావు, టీఆర్ఎస్ ఎల్లంపేట గ్రామ అధ్యక్షుడు రాజశేఖర్ముదిరాజ్, రమేశ్, మాజీ అధ్యక్షుడు సురేశ్, నవనీత రామకృష్ణ, శ్రీరాం పాల్గొన్నారు.