మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 27: మల్లారెడ్డి కళాశాల మెయిన్ క్యాంపస్ విద్యార్థులు సాంప్రదాయేతర ఇంధన ఆధారిత వాహనాన్ని రూపొందించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ఉమ్మడిగా కృషి చేసి, సౌర, విద్యుత్ శక్తితో నడిచే హైబ్రిడ్ వాహనాన్ని ఆవిష్కరించారు. మల్లారెడ్డి కళాశాలలో రూపుదిద్దుకున్న వాహనాన్ని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి, డైరెక్టర్ రామస్వామి రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.