శామీర్పేట, సెప్టెంబర్ 26 : పార్టీ కార్యకర్తల కుటుంబాల కు బాసటగా ఉండి ఆదుకుంటామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మూడుచింతలపల్లి మండలంలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను మంత్రి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాలకు భరోసా నిస్తూ తనవంతు సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పోతారం చౌరస్తా వద్ద మొక్కలు నాటారు. కొల్తూర్ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుక్రెడ్డి, ఎంపీపీ హారికా మురళీగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్ మహేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, యూత్ అధ్యక్షుడు బాలమల్లేశ్, బీసీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆగయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాములునాయక్, రవికాంత్రెడ్డి, నాయకుడు మద్దుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.