జవహర్నగర్, సెప్టెంబర్ 25: నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ కమిటీల సభ్యులు పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ జవహర్నగర్ కార్పొరేషన్ కమిటీ అధ్యక్షుడు , అనుబంధ కమిటీల అధ్యక్షులు శనివారం కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో కలిసి కమిటీ సభ్యుల వివరాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానమివ్వాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, శ్రీవాణి శ్రీనివాస్, నాయకులు రాజశేఖర్, సాధిక్ పాల్గొన్నారు.
కార్పొరేషన్ అధ్యక్షుడిగా కొండల్ ముదిరాజ్, కమిటీ ప్రధాన కార్యదర్శులు జిట్టా శ్రీనివాస్, సిద్ధులు యాదవ్, సింగన్న బాల్రాజ్, సుధాకర్చారి, భాస్కర్, జనరల్ సెక్రటరీగా మహేశ్, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు.