మేడ్చల్, ఏప్రిల్ 10 : పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నా రు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 16వ వార్డుకు చెందిన సుధకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.14 వేల చెక్కును మంత్రి తన క్యాంపు కార్యాలయం లో శనివారం ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. లబ్ధిదారులు సీఎం రిలీఫ్ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమానాగరాజు, శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, మోహన్రెడ్డి, శ్రవణ్, రవీందర్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 10 : సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరంలాంటిదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన బబ్బూరి బాలనర్సింహాకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.32,500 చెక్కును శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సంతోశ్గౌడ్ పాల్గొన్నారు.