మేడ్చల్, సెప్టెంబర్ 23: నూతనంగా ఎన్నికైన పార్టీ కమిటీల సభ్యులు ఐకమత్యంగా ఉండి పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మేడ్చల్ మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల అధ్యక్షులు గురువారం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి కమిటీ సభ్యుల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ఉపాధ్యక్షులు రఘుపతిరెడ్డి, భూపాల్, వెంకటేశ్, రవిబాబు, యువజన అధ్యక్షుడు హరత్రెడ్డి, ప్రధానకార్యదర్శి బాలు ముదిరాజ్, మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు బాబు యాదవ్, మహేందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, జగన్రెడ్డి, భాగ్యారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రవీందర్గౌడ్, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.