కీసర, సెప్టెంబర్ 21: సీఎం సహాయనిధి నిరుపేదలను ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని భోగారం గ్రామానికి చెందిన డబ్బి నర్సింహా రెడ్డి వైద్య సహాయ నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంగళవారం మంత్రి నివాసంలో లబ్ధిదారుడికి మంత్రి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలందరికీ చెక్కులు మంజూరు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.నారాయణ, టీఆర్ఎస్ నేతలు రమేశ్గుప్త, కీసరగుట్ట ట్రస్టుబోర్డు మెంబర్ రామిడి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీ బొక్కోనిగూడకు చెందిన బొక్క సీతారామ రెడ్డి వైద్య సహాయ నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి మంగళవారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు మేలు చేస్తున్నదన్నారు. టీఆర్ఎస్ నాయకుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఎంపాల సుధాకర్ రెడ్డి నాయకులు దర్గ దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
జవహర్నగర్ : జవహర్నగర్ బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూ ప్రసాదాన్ని మంగళవారం మేకల అయ్యప్ప కుటుంబసభ్యులు మంత్రి మల్లారెడ్డిని కలిసి అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో మేయర్ మేకల కావ్య, కార్పొరేటర్ ఏకే మురుగేశ్, నాయకులు ఉన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం, దమ్మాయిగూడకు చెందిన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన సభ్యులు శిలాసాగరం భాగ్యలక్ష్మి, దుర్గం సాయినాథ్ గౌడ్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, నాయకులు నాగేందర్ పాల్గొన్నారు.