జవహర్నగర్, సెప్టెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రవీందర్గుప్తా, కుతాడి మల్లేశ్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి స్వాతి, కాలురాం తదితరులు మొత్తం 500 మంది నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు 3వ డివిజన్లో కార్పొరేటర్ రోజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఇతర పార్టీలపై ప్రజలకు విశ్వాసం పోయిందని, తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని గుర్తించారని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, నాగరాణి వెంకటేశ్, గండి రాంచందర్, శారదామనోధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.