మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 19 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ , కండ్లకోయకు చెందిన కాంగ్రెస్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నాయకుడు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ఆదివారం గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమన్నారు. ఉద్యమ పార్టీగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం సాధించిందన్నారు. టీఆర్ఎస్ పాలనపై నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని, కలిసికట్టుగా కలలుగన్న బంగారు తెలంగాణ సాధించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, వెంకటేశ్ ముదిరాజ్ గౌస్ఖాన్, రాజేందర్ ముదిరాజ్, రవీందర్ గౌడ్, సాంగారి సత్తిరెడ్డి పాల్గొన్నారు.