కీసర, సెప్టెంబర్ 18 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామానికి చెందిన నరసింహ, బెలిదే నరేశ్ వైద్య సహాయనిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన చెక్కులను మంత్రి బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ కీసర అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్ ముదిరాజ్, మల్లారెడ్డి, రమేశ్ గుప్త, జంగయ్యయాదవ్, శ్రావన్కుమార్ గుప్త, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.