కీసర, సెప్టెంబర్ 17: నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా టీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల పార్టీలో ఎన్నికైన గ్రామ, యూత్ కమిటీలు, టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మంత్రిని కలిశారు. కొత్తగా ఎన్నికైన వారందరికీ మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ మల్లారపు ఇందిర , ప్రధాన కార్యదర్శి నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జవహర్నగర్ : జవహర్నగర్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేశ్ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని నూతన కమిటీ సభ్యులతో కలిశారు. డివిజన్ అధ్యక్షుడిగా ఆనంద్ గైక్వాడ్, సెక్రటరీ పంతంగి కుమార్, యువజన విభాగం అధ్యక్షుడుగా పృథ్వీరాజ్గౌడ్, బీసీసెల్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్దులు యాదవ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని దమ్మాయిగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని అహ్మద్గూడ 5వ వార్డు టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో అధ్యక్షుడిగా పాండు గౌడ్, యూత్ అధ్యక్షుడుగా పల్లె సాయి కృష్ణగౌడ్తో పాటు సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కొత్త భాస్కర్ గౌడ్, కౌన్సిలర్ నానూనాయక్, రాజు ముదిరాజ్, బాల్రెడ్డి, నరేశ్గౌడ్, సురేశ్ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, మల్లేశ్ వంశీరాజ్ పాల్గొన్నారు.