మేడ్చల్ కలెక్టరేట్/జవహర్నగర్/శామీర్పేట/ ఘట్కేస ర్,సెప్టెంబర్15: సీఎంఆర్ఎఫ్ పేద కుటుంబాలకు వరంలా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎం.రాజు,ఎం.పెంటయ్య,మెహజాబీన్ బానుకు,శామీర్పేట గ్రామానికి చెందిన మహ్మద్ గౌస్కు మంజూరైన రూ.59 వేలు,నాగారం మున్సిపాలిటీకి చెందిన సత్యనారాయణ గౌడ్కు రూ.30వేల చెక్కులను మంత్రి వారికి అందజేశారు. అదేవిధంగా జవహర్నగర్ పరిధిలోని ఐదో డివిజన్కు చెందిన రాజవర్ధన్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధి కింద రూ. 15వేలు మంజూరు కాగా ఆ చెక్కును అతనికి డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేశ్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు,ఘట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కె. కుమార్,టీఆర్ఎస్ శామీర్పేట మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్గౌడ్, సర్పంచ్ ఆంజనేయులు, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, శ్రీనివాస్రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, సాజిద్, మురళీగౌడ్, అఫ్జల్ఖాన్,జవహర్నగర్ మాజీ ఎంపీటీసీ సిద్దులుయాదవ్, ఆనంద్ గైక్వాడ్, రాజు, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి, జవహర్నగర్ డిప్యూ టీ మేయర్ శ్రీనివాస్ గుస్తా, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజుశ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.