జవహర్నగర్, సెప్టెంబర్ 14: స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం 7 డివిజన్లలో సుమారు రూ. 3.99 కోట్లు డీఎంఎఫ్టీ నిధులతో సీసీరోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, లైటింగ్, ప్రధాన రహదారులకు అధికంగా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.కార్పొరేషన్ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, ఆర్అండ్బీ అధికారులు డీఈ రవీందర్గౌడ్, ఈఈ శ్రీనివాస్మూర్తి, ఏఈ రంజిత్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్రామ్, జిల్లా నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.