మేడ్చల్, సెప్టెంబర్ 14: పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యత దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి మండలాల పరిధిలోని గ్రామ టీఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న టీఆర్ఎస్లో కష్టపడి పనిచేసిన వారికి అధిష్టానం గుర్తింపునిచ్చి సముచిత స్థానం కల్పిస్తున్నదని తెలిపారు. పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీలు పద్మాజనగ్రెడ్డి, ఎల్లుబాయి, హారిక, జడ్పీటీసీలు శైలజా రెడ్డి, అనితా లాలయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, జగన్రెడ్డి, భాగ్యారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నూతన గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.