రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలో వరి పొలాలను గురువారం మంత్రి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పండించిన ప్రతీ గింజకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ, రైతుల విశ్రాంతి కోసం షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీర్జాదీగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మేడ్చల్ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి, కార్పొరేటర్లు,వార్డుసభ్యులు,టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.