శామీర్పేట, ఆగస్టు 28 : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అలియాబాద్ గ్రామానికి చెందిన గోలిపల్లి శిరీషాకరుణాకర్రెడ్డికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును లబ్ధిదారుడికి మంత్రి శనివారం అందజేశారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.
కీసర : చీర్యాల్ గ్రామానికి చెందిన నారాయణకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కీసర ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, సర్పంచులు శనివారం లబ్ధిదారుడికి అందజేశారు. సర్పంచ్ ధర్మేందర్, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.