శామీర్పేట, ఆగస్టు 5: అన్ని రంగాల్లో తెలంగాణాను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత మండలం మూడు చింతలపల్లిలోని రైతు వేదికలో గురువారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 58 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శం అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం ఆలోచన కూడా చేయలేని పథకాలను ప్రవేశపట్టి ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రైతు బందు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి నేడు దళిత వర్గాల అభ్యున్నతికి దళిత బంధుతో ముందుకు వచ్చారని తెలిపారు.
చెప్పిందే తడువుగా వాసాల మర్రి గ్రామాన్ని సందర్శించి దళితుల స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు 76 మందికి దళిత బంధును మంజూరు చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం, లింగాపూర్ తండాలో జరిగిన తీజ్ పండుగలో పాల్గొని మహిళలతో పాటు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హారికమురళిగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు జామ్ రవి, కృపాకర్రెడ్డి, సింగం ఆంజనేయులు, విష్ణువర్ధన్రెడ్డి, ఇస్తారి, నర్సింహ్మరెడ్డి, గోపీ నాయక్, ఎంపీటీసీలు నాగరాజు, హనుమంత్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్పాషా, నాయకులు విష్ణు గౌడ్, మద్దుల శ్రీనివాస్రెడ్డి, మల్లేష్ గౌడ్, శ్రీకాంత్రెడ్డి, లబ్దిదారులు పాల్గొన్నారు.