మేడ్చల్ రూరల్, ఆగస్టు 4: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం గుండ్లపోచంపల్లికి విచ్చేసిన మంత్రి మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్, ట్యాంకర్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గతంలో ఒకసారి గుండ్లపోచంపల్లికి వచ్చానని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధిలో గణనీయమైన మార్పు కన్పిస్తుందన్నారు. పాలకవర్గం ఇదే స్ఫూర్తితో అభివృద్ధిలో వేగాన్ని పెంచాలని సూచించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలకు నిధులు కొరత లేదన్నారు. మున్సిపాలిటీ చైర్పర్సన్లు, పాలకవర్గ సభ్యులు సమష్టిగా కృషి చేసి, అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు రాగజ్యోతి, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, బాలరాజు, వీణాసురేందర్గౌడ్, జైపాల్రెడ్డి, పెంటయ్య, శ్రీనివాస్, హేమంత్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, వర్కింగ్ ప్రెసిండెంట్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.