జవహర్నగర్, జూలై 30: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్కు చెందిన రమ్యసాయికుమార్ అనే వ్యక్తికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ. 60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కార్పొరేటర్ రోజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరం లాంటిదన్నారు. అనంతరం కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శివాజీ, రాజశేఖర్, మేకల భార్గవ్, వెంకన్న, వెంకటేశ్, సాధిక్ పాల్గొన్నారు.
మేడ్చల్ : కీసరకు చెందిన మచ్చాని లక్ష్మణ్యాదవ్కు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కీసర మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ జంగయ్యయాదవ్ శుక్రవారం లబ్ధిదారుడికి అందజేశారు.