మేడ్చల్, జూలై29(నమస్తే తెలంగాణ): రైతు సహకార సంఘాల నుంచి రైతులకు సకాలంతో పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. సహకార సంఘాల చైర్మన్లతో గురువారం ఘట్కేసర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన రైతులకు ఎకరాకు మూడు లక్షల చొప్పున గరిష్టంగా రూ. 10లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎరువుల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. పంట కొనుగోలుకు సహకరించిన సహకార సంఘాల చైర్మన్లను మంత్రి అభినందించారు. సమావేశంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, సహకార సంఘాల చైర్మన్లు రాంరెడ్డి, ప్రభాకర్రెడ్డి, సురేశ్రెడ్డి, రణదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.