కీసర, జూలై 29: అర్హులైన నిరుపేదలకు సీఎం సహాయనిధి కింద వచ్చే ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.లక్ష చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారుడికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేసే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్రెడ్డి, జంగారెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన ఎం.పద్మకు వైద్య సహాయం నిమిత్తం రూ.25వేల చెక్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారుడికి గురువారం అందజేశారు. మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కోఆష్షన్ సభ్యుడు అక్రం అలీ,టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.