మేడ్చల్ కలెక్టరేట్, జూలై 25 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ఆర్జీకే కాలనీకి చెందిన లీలాకు వైద్య సహాయం నిమిత్తం రూ. 50 వేలు, కృష్ణకు రూ.14,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ నాగాయిపల్లి సుజాత సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగాయిపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్ :జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్కు చెందిన సుదర్శన్ అనే వ్యక్తికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా రూ. 25వేలు చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కార్పొరేటర్ నవీన్ సమక్షంలో లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు మంత్రి మల్లారెడ్డి ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.