ఘట్కేసర్ రూరల్, జూలై 22 : యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో క్రికెట్ చాంపియన్షిప్ పోటీలను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.