మేడ్చల్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పని అయిపోయిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుత్తడి సాయికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువాలు వేసి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు విజయ్కుమార్, శ్రీనివాస్, కిరణ్, వంశీ, సందీప్, అభిషేక్, కరుణాకర్, నాగేందర్తో పాటు 50మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్ నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.