శామీర్పేట, జూలై 16 : సీఎం దత్తత మండలం మూడుచింతలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కార్మికశాఖ మంత్రి మలారెడ్డి అన్నారు. కేశవరంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా శుక్రవారం కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి మైసయ్య యాదవ్, సభ్యులు కోవూరి అశోక్, ఉడుతల కృష్ణ, భాకారం నాగరాజు, గవ్వల రమేశ్, సావిత్రి, పూజారి ఉపేందర్రావులను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మూడుచింతలపల్లి మండలాన్ని దత్తత తీసుకుని ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆలయ భూములను కాపాడేందుకు చుట్టూ ప్రహరీ నిర్మించాలని, తన సొంత నిధులతో నిర్మిస్తానని మంత్రి భరోసానిచ్చారు.
అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ హారికామురళీగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి చిత్తాగౌడ్, సర్పంచులు జ్యోతిబలరాంగౌడ్, కృపాకర్రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇస్తారి, ఆంజనేయులు, ఉపసర్పంచులు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ సర్పంచులు, నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.