మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జవహార్నగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూనే అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. రానున్న రోజులలో ఇతర పార్టీల అడ్రస్సులు గల్లంతు కావడం ఖాయమని అనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడం వల్లే ప్రజలకు ఆయనపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు.
కార్పొరేటర్లు బల్లి రోజా శ్రీనివాస్, కుత్తడి సాయికుమార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ గౌడ్, శాగంటి వెంకటేశ్, బాల మహేశ్, కటకం శ్రీనివాస్, కిరణ్, శేఖర్, జనార్దన్, భాస్కర్, మహేశ్, హసీనా బేగం, స్వాతి, లక్ష్మీ ఇతర నాయకులతో పాటు వంద మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు నవీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.