కీసర,జూలై 14: ప్రభుత్వ హయాంలోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలంలోని అన్ని గ్రామాలకు నిధులను కేటాయించాలంటూ బుధవారం కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీలు సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. మండలంలోని 10 పంచాయతీల్లో అనేక సమస్యలున్నాయని, వీటికి నిధులను మంజూరు చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేరుగా ప్రభుత్వం నుంచి గ్రామాలకు నిధులు మంజూరు అవుతున్నాయని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
గ్రామాల వారీగా సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకురావాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామాలు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలకు ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా స్థానిక నేతలు గ్రామాల్లో ఉన్న సహజ వనరులను గ్రామాభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తటాకం నారాయణశర్మ, పండుగ కవితాశశికాంత్, జూపల్లి వెంకటేశ్, సింగిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రమీలాఅమరేందర్రెడ్డి, మంచాల కిరణ్జ్యోతి, నేతలు కందాడి అమరేందర్రెడ్డి, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 14 : నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డుకు చెందిన కాసుల శోభకు రూ. 25 వేలు, నాగారానికి చెందిన నాగమణికి రూ. 45వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కొత్త సురేఖ సీఎం కేసీఆర్కు, మంత్రి మల్లారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ము న్సిపల్ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి, తేళ్ల శ్రీధర్, ప్రధా న కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ గౌడ్, నాయకులు కొత్త భాస్కర్ గౌడ్, నిమ్మల శ్రీనివాస్, పాండు పాల్గొన్నారు.