మల్లాపూర్, జూలై 11 : కరోనా నేపథ్యంలో ప్రాణాలను సైతం పక్కన పెట్టి సేవలందించిన డాక్టర్లు, నర్సులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్ వీఎన్ఆర్ గార్డెన్లో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామ్సన్, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్లు, నర్సులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ నారాయణరావు, డాక్టర్ శ్రీకాంత్, ఆనంద్, రఘునాథస్వామి, సుధారాణి, వేణుగోపాల్రెడ్డి, డీపీఓ మంజుల, శ్రీనివాస్, వైద్యాధికారులు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, గరిక సుధాకర్, నెమలి రవి, హమాలీ శ్రీనన్న, నందికంటి శివ, తదితరులు పాల్గొన్నారు.