శామీర్పేట, ఆగస్టు 16 : హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన దళిత బంధు సభకు వెళ్తున్న మంత్రి కేటీఆర్కు రాజీవ్ రహదారిపై శామీర్పేట కట్టమైసమ్మ ఆలయం వద్ద మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంత్రులు శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్కుమార్లను ఎక్కించుకుని తానే స్వయంగా కారు డ్రైవింగ్ చేసిన మంత్రి కేటీఆర్ రాజీవ్హ్రదారిపై గులాబీ శ్రేణులను చూసి కారు ఆపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని సన్మానించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డిని తన కారులో ఎక్కించుకుని పార్టీ శ్రేణులతో కలిసి భారీ కాన్వాయ్గా హుజూరాబాద్కు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.జహంగీర్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, భద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, జడ్పీటీసీ అనితలాలయ్య, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, మేయర్లు జక్క వెంకట్రెడ్డి, మేకల కావ్య, శ్యామల బుచ్చిరెడ్డి, చైర్మన్లు కారంగుల రాజేశ్వర్రావు, కొండల్రెడ్డి, పావనీజంగయ్యయాదవ్, చంద్రారెడ్డి, ప్రణీతశ్రీకాంత్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.