మారేడ్పల్లి, సెప్టెంబర్ 8: ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం శివాజీనగర్లోని పెరుమాళ్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన వెయ్యి గజాల స్థలంలో కల్యాణ మండప నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జి.సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.1200 కోట్లతో యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. రూ.3.5కోట్లతో ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, ధర్మకర్తల సహకారంతో ఆలయ కల్యాణ మండప నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు.ఎమ్మెల్యే జి.సాయన్న మాట్లాడుతూ..పెరుమాళ్ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దీపిక, ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఈఓ శ్రీనివాస శర్మ, ట్రస్టు బోర్డు సభ్యులు నరేందర్రెడ్డి. తేజ్పాల్, నరేశ్, రాయి వెంకటేశ్, శారద, గోవిందన్, నిత్యానంద్, మురళీ, శ్రీనివాస్రెడ్డి, సురేశ్ కుమార్, సాయిబాబా, సత్యనారాయణ, సబిత, రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్.శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.