కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డిని టీటీడీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్లోని వై.వి.సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్రావుతో పాటు తెలంగాణ బీసీ నాయకుడు విఠల్ ముదిరాజ్, బీసీ సంఘర్షణ సమితీ ఉపాధ్యక్షుడు అంబాల మహేశ్గౌడ్లు పాల్గొన్నారు.