కాప్రా : నాచారం డివిజన్లో మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. బాబానగర్, ఎర్రకుంట ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమ పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాలనీవాసులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఉప్పల్ తాసిల్దార్ గౌతమ్కుమార్, కాప్రాసర్కిల్ డీసీ శంకర్, ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, పీఓ ఇందిర, శానిటరీ సూపర్వైజర్ నాగరాజు, వైద్య ఆరోగ్య, పారిశుద్ద్య, యూసీడీ, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.