మేడ్చల్, అక్టోబర్11(నమస్తే తెలంగాణ): మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం మహిళా ఉద్యోగులు ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పండుగను నిర్వహించి ఆడపడుచులకు ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు.
బతుకమ్మ సంబురాల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, గౌతమ్కుమార్ తాసీల్దార్లు పాల్గొన్నారు.
శామీర్పేట : శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వాణి, ఎంఈవో వసంతకుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయశీల, ఎంపీటీసీలు, సర్పంచులు,అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిం చారు.వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీఓ అరుణ, సర్పంచులు కావేరి, జలజ, ఎంపీటీసీ శోభారాణి, మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.