మేడ్చల్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): మేడ్చల్ బడి ప్రైమరీ స్కూల్ వెబ్ సైట్ను శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ప్రారంభించారు. ఉన్నత పాఠశాలలకే పరిమితమైన బడి వెబ్ సైట్ను ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక వెబ్సైట్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠ్యాంశాలను సిద్ధం చేసిన వెబ్ సైట్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన చేతుల మీదుగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి ఎన్ఎస్ఎస్ ప్రసాద్ సమక్షంలో ప్రారంభించారు. విద్యార్థులందరికి ఈ వెబ్ సైట్ చేరే విధంగా ఉపాధ్యాయులు చూడాలని దేవసేన సూచించారు.