పీర్జాదిగూడ : ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మేయర్ జక్క వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అని చాటిన కాళోజీ తెలంగాణ లో ఓ వైవిధ్యమైన ఉద్యమకారుడు. ఆయన రచించిన “నా గొడవ” తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనాన్నే సృష్టించిందని అన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎం.శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ , కార్పొరేటర్లు సుభాష్ నాయక్ , కొల్తూరు మహేష్ , మద్ది యుగేందర్ రెడ్డి, కుర్ర షాలిని, కౌడే పోచయ్య, కో-ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్ , షేక్ ఇర్ఫాన్ , నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి , పప్పుల అంజి రెడ్డి , బైటింటి ఈశ్వర్ రెడ్డి , యాసారం మహేష్ , రఘువర్ధన్ రెడ్డి , రాకేష్ గారు తదితరులు పాల్గొన్నారు.