మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 02 : తమతో కలిసి ఆడి, పా డి, ఆత్మీయురాలుగా ఉన్న వివాహిత లైంగిక వేధింపులతో మృతి చెందిన సంఘటన ఆ యువకుడిని మార్చింది. పు రుషాంహాకార సమాజంలో మహిళలు, బాలికలు బలిపశువులుగా మారకముందే తగిన శిక్షణతో తమను తాము రక్షించుకునే పరిస్థితులు తీసుకురావాలని సంకల్పించాడు. స్వతహాగా పాఠశాల స్థాయిలో ఎన్సీసీ శిక్షణ పొంది, తైక్వాండో, కిక్ బాక్సింగ్లో జాతీయస్థాయి ప్లేయరైనా అత డు సేవా చేయాలనే ధృక్పతంతో షీల్డ్ వ్యవస్థను నెలకోల్ప డు. సొంత డబ్బుతో బాలికలు, మహిళలకు ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాడు. రాంపల్లి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు శిక్షణ శిబిరాలను విస్తరించాడు.
శిక్షణ పొందాలనుకునే వారు ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు వెళ్లి శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే అభ్యర్థనలను స్వీకరించి, ఉచితంగా శిక్షణనిస్తున్నారు. నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ఈ ప్రాంతమైనా కనీసం 30నుంచి 40మంది వరకు ఒక చోట చేరి శిక్షణను అభ్యర్థిస్తే శిక్షణనిస్తామని సంతోశ్ తెలిపారు.
మహిళా శిక్షణతో పాటు ఇంటర్, డిగ్రీ చదివి కంపెనీల్లో 10, 12గంటల పాటు శ్రమ ను ధారపోస్తూ తమ శక్తి, యుక్తులను నిర్వీర్యం చేసుకుంటున్న యువతకు మార్గదర్శం చేసేందుకు సంతోశ్ కృషి చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చి, శిక్షకులుగా మారుస్తున్నారు. ఈ శిక్షణతో తరగతులు నిర్వహిస్తూ అంతకు మించి సులభంగా సంపాదిస్తున్నారు. మిగితా సమయాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, వ్యక్తిగతంగా అభివృద్ధి చేసేందుకు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
డిగ్రీ చదువుకుని కంపెనీలో రూ. 10వేలకు పని చేస్తున్న నాకు సంతోశ్ పరిచయమయ్యారు. అతడి వద్ద శిక్షణ తీసుకున్న నేను ప్రస్తుతం సంస్థలో సేవ చేస్తున్నా. చాలా మందికి శిక్షణ ఇవ్వడంతో నేడు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు సంపాదిస్తున్నా. షీల్డ్లో పనిచేయడం సంతోషంగా ఉంది. – వెంకన్న, షీల్డ్ సభ్యులు