దుండిగల్, అక్టోబర్ 22 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల మరో ఘనతను దక్కించుకుంది. జాతీయ స్థాయిలో ఇటీవల నిర్వహించిన ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్-2021లో కళాశాలకు చోటుదక్కింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో కాలేజీయేట్ ఎడ్యూకేషన్ కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి కళాశాల యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్ డా.కె.శ్రీనివాసరావును అభినందించి ప్రశంసాపత్రం, మెమొంటోను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సీఎస్ఈ విభాగాధిపతి డా.చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మర్రిలక్ష్మణ్రెడ్డి తమ కళాశాలకు ఎన్ఐఆర్ఎఫ్-2021లో చోటు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల గతంలోనే ఎన్బీఏ అక్రిడేషన్తో పాటు టైయర్-1, నాక్-ఏ గ్రేడ్, యూజీసీ అటానమస్ హోదాను సాధించిన విషయం విధితమే.
మరిన్ని ఉన్నతప్రమాణాలు పెంచుతాం.!
ఎంఎల్ఆర్ఐటీ కళాశాలకు ఎన్ఐఆర్ఎఫ్ఐ ర్యాంకింగ్-2021లో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఇదివరకే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఏఆర్ఈ, వర్ధమాన్ కాలేజీలకు సైతం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చోటు దక్కింది. తాజాగా ఎంఎల్ఆర్ఐటీకి ఈ అవకాశం దక్కడం మరింత సంతోశాన్ని కల్గిస్తుంది. దీంతో మా కళాశాలల్లో మరిన్ని ఉన్నత ప్రమాణాలు పెంచేలా ఇది ఉపయోగపడుతుంది. – మర్రి రాజశేఖర్రెడ్డి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్చార్జి