కంటోన్మెంట్, జూన్ 8: విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ పడాలనే ఆలోచన చాలా గొప్పదని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం బోర్డు పరిధిలోని మూడోవార్డు అంబేద్కర్నగర్లో పెరుమాల్ దేవస్థానం పాలకమండలి సభ్యు డు అజయ్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కవారికి తోచి న విధంగా సాయపడాలని పిలుపునిచ్చారు. దేశంలోని సీఎంలలో ఆదర్శవంతులైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్నగర్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కె.మధు, జహంగీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.