దుండిగల్, జూన్ 20 : మర్రి లక్ష్మణ్రెడ్డి విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కళాశాలల కార్యదర్శి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో కళాశాలలో వివిధ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులకు ఎంఎన్సీ కంపెనీలలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్లేస్మెంట్ మీట్ను నిర్వహించడంలో భాగంగా ఆదివారం ఆన్లైన్ ద్వారా ప్లేస్మెంట్ సక్సెస్ మీట్-21 కార్యక్రమాన్ని నిర్వహించారు. 40ఎంఎన్సీ కంపెనీలు నిర్వహించి న ఇంటర్వ్యూలో 750 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎల్ఆర్ఐటీ వి ద్యాసంస్థల్లో విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క విద్యార్థికి ఉపా ధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు నాణ్యమైన, సాంకేతిక విద్యను అందించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారన్నారు. కరోనా సమయంలోనూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. అమెజాన్, యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసీస్, ఎల్టీఐ, కాగ్నిజెంట్, వర్చుసా, ఏపామ్సిస్టమ్, విప్రో, సైంట్ వంటి పలు ప్రసిద్ధ కంపెనీలు భాగస్వాములైనట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్రావు, ప్లేస్మెంట్ హెడ్ రవిచంద్ర, డెవలప్మెంట్ విభాగాధిపతి డా. రాజశేఖర్రెడ్డి, విద్యార్థులు భాగస్వాములయ్యారు.