మేడ్చల్, జూన్ 7: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తె లంగాణ వైద్య చరిత్రలో మరో ముందడుగు పడనున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రభుత్వ దవా ఖానలను బలోపేతం చేయడంతో పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నా రు. సాధారణ వైద్యంతో పాటు ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉపకేంద్రాల్లో సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు ఇంటింటా జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ చేయడం దేశంలోనే ఆదర్శనీయంగా మారింద న్నారు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల రేటు గణనీయంగా పెరిగి నిరుపేదల కు మేలు జరుగుతుందన్నారు. దవాఖానలో ఉన్న ఖర్చుల్లో అత్యధికంగా వైద్య పరీక్షలకే చెల్లించాల్సి వస్తున్నదన్నారు. ఇకముందు ఈ కేంద్రాల ఏర్పాటుతో పేదలకు 57 రకాల పరీక్ష లు ఉచితంగా చేయడం జరుగుతుందని సీఎం పేర్కొనడంతో పాటు త్వరలో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.