నేరేడ్మెట్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్లో నివాసం ఉంటున్న రాపల్లి సతీష రెడ్డి (34) హోటల్లో పనిచేస్తుంటాడు. అయితే ఆగస్టు 25వ తేదీన గజ్వేల్ నుంచి ఏఎస్రావునగర్ ఆర్కేహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న బందువుల ఇంటికి వచ్చాడు.
25వ తేదీ మధ్యాహ్నం 2గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మంగళవారం నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.