కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 24: మేకిన్ తెలంగాణ దిశగా అడుగులు వేసేందుకు పారిశ్రామిక వేత్తలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి హరీశ్ అన్నారు. శుక్రవారం జీడిమెట్ల పరిశ్రమల సంఘం కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వాణిజ్య వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 30 స్టాళ్లలో జిల్లాలోని ఫార్మా, ఇంజినీరింగ్, ఏరోస్పేస్, డ్రిల్బిట్స్, ప్లాస్టిక్ ఇతర రంగాలకు చెందిన ఉత్పత్తిదారులు తమ వస్తువులను ప్రదర్శించారు. పరిశ్రమల శాఖ అధికారులు డి.వెంకటేశ్వర్లు, ఉపసంచాలకులు కేవీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, సెప్టెంబర్24(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.