మేడ్చల్ మల్కాజిగిరి : బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మరకు.. సంగా రెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట గ్రామానికి చెందిన స్వామి (34), మోల్డ్ టెక్ పరిశ్రమలో కొంత కాలంగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నడు.
ఈ క్రమంలో సోమవారం విధులకు హాజరయ్యేందుకు తన గ్లామర్ బైక్ పై ఇంటి నుంచి బయలుదేరి దుండిగల్కు వస్తుండగా.. మార్గమధ్యంలో మూల మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ స్వామి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్వామి బైక్ పై నుంచి కింద పడిపో గా అతనిపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.